MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 4:02 pm Posted by : State Buearo

రేపే అన్నదాతా సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ.3,125 కోట్లు

 

కడప మనస్సాక్షి జూన్ 19:

*అన్నదాతా సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ.3,125 కోట్లు*

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ సాయాన్ని సీఎం చంద్రబాబు ఈ నెల 20న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగం గుంట్ల గ్రామంలో జరిగే సభలో విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ లో భాగంగా పశ్చిమబెంగాల్లోని తారకేశ్వర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తారు. 2026-27 సంవత్సరానికి తొలి విడతగా.. ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 వేల చొప్పున జమ చేస్తారు. ఇందులో పీఎం కిసాన్ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ. 5 వేల చొప్పున ఇస్తారు. 45,69,817 మంది పట్టాదారులు, 1,16,021 మంది అటవీహక్కు సాగుదారుల కుటుంబాలకు రూ.3,125.47 కోట్లు జమ చేస్తారు.