📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పారిశుధ్య కార్మికులే అసలైన సమాజ సేవకులు

పారిశుధ్య కార్మికులే అసలైన సమాజ సేవకులు

📰 Generate e-Paper Clip

-బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మ

వేంపల్లి,ఆగష్టు 28 మనస్సాక్షి: భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి లో పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మ మాట్లాడుతూ సమాజంలో ప్రజలందరూ ఆరోగ్యంగ, సురక్షితంగా వున్నారంటే అందులో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని , అలాగే మన ఇళ్ళులు , ఆసుపత్రులు, రోడ్లు , పాఠశాలలు ఇవ్వన్నీ శుభ్రంగా వున్నాయంటే అదంతా కార్మికుల చలువే అని తెలిపారు. ఈ సందర్బంగా పంచాయితీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులైన అన్నలకు , తమ్ముళ్లకు , అక్క చెల్లెళ్లకు భారతీయ జనతా పార్టీ నాయకులు రాఖీలు కట్టి వారితో కలిసి రాఖీ పౌర్ణమి పండుగ చేసుకుని పారిశుద్ధ్య కార్మికులతో మనకి కార్మికులు రక్ష , మనం కార్మికులకు రక్ష , మనందరం దేశానికి రక్ష అని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షులు దొంతు సుమన్, వృషభాచలేశ్వర ఆలయ కమిటీ సభ్యుడు సునీల్ కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఐ.టి సెల్ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!