📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తూముకుంట, తలముడిపీ గ్రామాల్లో రీ సర్వే పై అవగాహన ర్యాలీ

తూముకుంట, తలముడిపీ గ్రామాల్లో రీ సర్వే పై అవగాహన ర్యాలీ

📰 Generate e-Paper Clip

గాలివీడు జులై 30(కడప మనస్సాక్షి ప్రతినిధి)

భూముల రీ-సర్వే ప్రక్రియపై రైతుల్లో మరియు ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా అవగాహన సదస్సులు మరియు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు
తహసీల్దార్ బాగ్యలత పేర్కొన్నారు.
అందులో భాగంగా
తలముడిపీ..తూముకుంట గ్రామాల్లో రవెన్యూ అధికారులు రీ సర్వేపై అవగాహన ర్యాలీని గురువారం నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా తహాసిల్దార్‌ భాగ్యలత మాట్లాడుతూ… గ్రామంలో ఉన్నటువంటి భూమునంతటిని సర్వే చేసి రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రజల్లో రీ సర్వేపై ఉన్న అపోహలను తొలగించడానికి అవగాహన సదస్సుని, ర్యాలీని నిర్వహించమన్నారు. ఈ కార్యక్రమంలో డి ఐ సోమశేఖర్,ఆర్ ఐ భవాని శంకర్ ,మండల సర్వేయర్ సుబ్రమణ్యం,సర్వేయర్లు హేమనార్ రెడ్డి,వినోద్ కుమార్ ,షరీఫ్ విఆర్ఓ యేసు దాస్ , వెంకటయ్య తదితురులు రెవెన్యూ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!