– వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేత ఎస్.రెడ్డీ సాహెబ్
మదనపల్లె : షేక్ మస్తాన్ సాహెబ్,షేక్ షబానా దంపతుల కుమారుడు షేక్ ఎహషాన్ నిఖా వేడుక మదనపల్లె పట్టణం,ఎన్వీఆర్ కల్యాణ మండపంలో గురువారం ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాహ వేడుకలు బంధువుల మధ్య అనురాగ,ఆప్యాయతలు పెంచుతాయన్నారు.అదేవిధంగా వివాహ వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు,ప్రజలను ఆయన ఆప్యాయంగా పలకరించారు.అనంతరం అందరితో కలిసి విందు భోజనం చేశారు.
